హైదరాబాదు, జనవరి 20: తెలంగాణ సిఎల్పి నేతగా ఎంపికైన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు.
ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసి వ్యవహరిస్తారని స్పీకర్ ప్రకటించారు.