త్వరలో దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. దాదాపు 39 స్పెషల్ ట్రైన్స్ వేరు వేరు జోన్లలో నడుపుతున్నట్లు తెలిపింది. లాక్ డౌన్ కారణంగా అప్పటి నుండి కరోనా నిబంధనల మేరకు కొన్ని ప్రాంతాలలో రైలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో దసరా పండగ దేశవ్యాప్తంగా పెద్ద పండుగ కావడంతో కేంద్రం ప్రత్యేక రైళ్లను తిపాలని డిసైడ్ అయి… భారతీయ రైల్వే బోర్డు కి అనుమతి ఇచ్చింది. మరోపక్క దీపావళి పండుగ కూడా వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో కేంద్ర రైల్వే శాఖ నడిపే 39 ప్రత్యేక రైళ్లు వివరాలు చూస్తే…దురంతో, రాజధాని, శతాబ్ది, తేజస్ ఎక్స్ప్రెస్ రైల్ ని పున ప్రారంభించడానికి ఐఆర్సిటిసి రెడీ అయ్యింది.
కాగా మార్చి 19 నుంచి వైరస్ కారణంగా నిలిపివేసిన లక్నో- న్యూఢిల్లీ, అహ్మదాబాద్- ముంబై తేజస్, ఎక్స్ప్రెస్ రైళ్లను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డు ప్రకటించింది. మహమ్మారి కరోనా కారణంగా టికెట్లు బుకింగ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా టికెట్ బుక్ అయిన వారు మాత్రమే అరగంట ముందు స్టేషన్ కు వచ్చి కరోనా చెకప్ చేయించుకొన తర్వాతే స్టేషన్ లోకి అనుమతిస్తారు.