హైదరాబాదు, జనవరి 7: ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో డిప్యూటి సిఎం మహమూద్ ఆలీ పాల్గొన్నారు. నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన అంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ను నియమించాలని నిర్ణయించారు.
నామినేటెడ్ సభ్యుడు కూడా ఇతర సభ్యులతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ సభ్యుడిని ఆలస్యంగా నియమించడం వల్ల వారు విలువైన పదవీ కాలాన్ని కోల్పోతున్నారు కాబట్టి దానిని నివారించేందుకు వెంటనే ఎంపిక చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేశారు. ముంతాజ్ ఖాన్ ఎంపిక నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఆయన ఆమోదం తెలిపిన వెంటనే గెజిట్ విడుదల అవుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?