ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటు చేసిన మంత్రి వర్గం పెద్దగా ప్రజల మన్ననలను పొందుకో లేనట్లు తేలింది. ఈ విషయంలో బాబు గారే సూపర్ హిట్, వైయస్ జగన్ యావరేజ్ అనే టాక్ వినపడుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటైన మంత్రివర్గం చాలా వరకు సీనియర్లు పైగా తల పండిపోయిన రాజకీయ నేతలు కావడంతో నిధులు తీసుకువచ్చి ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క చంద్రబాబు సంతోషపడే రీతిలో తమ మార్క్ ఐడియాలతో దూసుకుపోయారు.
దీంతో ప్రజలలో పార్టీలో సదరు మంత్రులుకి మంచి పేరు వచ్చేది. కానీ వైయస్ జగన్ క్యాబినెట్ మంత్రి వర్గం గమనిస్తే దాదాపు ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు, ఎస్సీ వర్గం చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తూ జగన్ తన క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అయితే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు చాలావరకు కొత్త వారు కావటంతో దూసుకుపోయే తత్వం విషయంలో చాలా స్లోగా ఉండటంతోపాటు, రెండున్నర ఏళ్ల కాలపరిమితి వైయస్ జగన్ విధించడంతో….. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో జగన్ క్యాబినెట్ లో కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా మంత్రులంతా ఆటలో అరటిపండు మాదిరిగా అయిపోయిన విధంగా పరిస్థితి మారింది. వైస్సార్సీపీ మంత్రుల పనితనం బాగోలేదని చాలామంది అనుకుంటున్నారట. మొత్తానికి చూసుకుంటే ఎలక్షన్ తర్వాత బాబు తన క్యాబినెట్ విషయంలో ప్రజలలో మంచి మార్కులు సంపాదించుకున్న జగన్ క్యాబినెట్ పెద్దగా ప్రజల మన్ననలను పొందుకోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.