Corona: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా కేసులు పెరుగుతూ ఉండటంతో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితిలో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ పరిణామాలతో ఆదాయాలు రాకపోవడంతో ప్రభుత్వాలు పనులు చేయటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో సమాజంలో ఉండే సెలబ్రిటీలు ప్రభుత్వాలకు అండగా ఉండే రీతిలో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అనేక మంది సెలబ్రిటీలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి డబ్బులు నటించగల మరికొంతమంది కరోనా రోగులను ఆదుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో ఎంతగానో పేరుగాంచిన సన్ టివి మీడియా సంస్థ అధినేత తాజాగా తమిళనాడు సీఎం ఉదయనిది స్టాలిన్ కి పది కోట్ల రూపాయల చెక్ అందజేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ ఇవ్వని రీతిలో సన్ టీవీ నెట్వర్క్ .. తమిళ ప్రజల బాధలను తీర్చడం కోసం భారీ విరాళం ప్రకటించడంతో దేశంలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉద్రిక్తత భారీగా ఉంది. ఇలాంటి తరుణంలో చాలా మంది ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళ రాష్ట్రంలో ఉండే రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా హీరోలు .. ముందుకు వస్తూ విరాళాలు అందిస్తున్నారు.
మరోవైపు దేశంలో ప్రతి మూల కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్ లేక ఉంటున్న వారికి సేవలు అందిస్తూ ఉన్నాడు భారతీయుల ఆపద్బాంధవుడు సోనుసూద్. గత ఏడాది నుండి తన సొంత డబ్బులతో దేశంలో అనేక మంది పేదలను .. వలస కూలీల ఆదుకుంటూ వస్తున్న సోనుసూద్ ప్రస్తుతం .. అనేక మంది ప్రాణాలను కాపాడే రీతిలో ఇతర దేశాల సాయం తో ఆక్సిజన్ సిలిండర్లు .. మరణానికి దగ్గరగా ఉన్న వారికి అందిస్తూ ఊపిరి పోస్తున్నాడు. ఈ రీతిగా దేశంలో చాలా మంచి మనసున్న మంచి మనుషులు ప్రభుత్వాలకు తోడుగా ఉంటూ మహమ్మారి తో పోరాటం చేస్తున్నారు.