అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని తరలిస్తే…నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారని తెలిపారు. నవరత్నాల అమలులో పూర్తిగా విఫలం చెందడంతో వైసీపీ నేతలు మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ పద్ధతి మార్చుకోకుంటే ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం నటులు పోరాటాలు చేశారని, జంతు క్రీడ కోసం తమిళ నటులు చూపించిన తెగువ అమరావతి రాజధాని విషయంలో తెలుగు నటులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి కొందరు తెలుగు నటులు తొత్తులుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నటులు గొంతు తెరచి అమరావతి రైతులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?