దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావటంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. 2004 2009 ఎన్నికలలో వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో యూపీఏ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సులువైన బాట వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని రాజకీయ నేతగా రాణించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలన ఒకలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా భిన్నంగా ప్రజల కోసం పరిపాలన అన్నట్టుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలించేవారు.
108,104 అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్… ముస్లింలకు రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకున్నారు. మేరు నగధీరుడు అన్న తరహాలో ఏపీలో ప్రజలకు తన మార్క్ పరిపాలన వైయస్సార్ అందించారు. ఎలక్షన్ల వరకు ప్రత్యర్థులు ఆ తర్వాత మనవారు అనేది వీటిలో రాజకీయాలు చేసేవారు. సంక్షేమ పథకాలు విషయంలో వాళ్లంత…నా రాష్ట్ర ప్రజలే అన్నట్టుగా వైయస్సార్ శత్రువులను సైతం ఆశ్చర్య పరిచేలా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకం అందేలా నిర్ణయాలు తీసుకునే వారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ ఒక్కరూ గుడిసెలో బ్రతక కూడదు అని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా సంకల్పించారు.
ఉచిత కరెంటు రైతులకు ఇస్తాను అని హామీ ఇచ్చిన సమయంలో ప్రత్యర్థులు అవి బట్టలు ఆరేసుకోవడానికి ఆ కరెంటు వైర్లు పనికొస్తాయని హేళన చేసిన వారు…. తలదించుకునేలా ఉచిత విద్యుత్తు అందించారు. జలయజ్ఞం పేరిట దాదాపు ఇరవై మూడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసి సగానికి సగం పూర్తి చేయడం జరిగింది. రాయలసీమలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు పునాది వేయడం జరిగింది. వైఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం కూడా పెంచడం జరిగింది.
అదేరీతిలో పోలవరం ప్రాజెక్టు కి ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించి…. కేంద్రం నుండి రావలసిన అన్ని అనుమతులు తీసుకొచ్చి, ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేద్దాం అన్నరీతిలో వైయస్సార్ ప్రజల నుండి దూరమయ్యారు. హెలికాప్టర్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలంతా తమ ఇంటిలో సభ్యుడు మరణించాడు అనే విధంగా బోరున ఏడ్చారు. ఏదిఏమైనా రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కి సరైన అర్థం చెప్పినోడు అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు.