Raghurama krishnam raju bail: సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క కేసు విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. గుండె శస్త్రచికిత్స జరగటం మరియు కాలికి గాయం కావడంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మాత్రమే విచారణ చేయాలని ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఎప్పుడు విచారణ చేపట్టిన 24 గంటల ముందు నోటీసు ఇచ్చి విచారణ చేయాలని కూడా స్పష్టం చేసింది. అంత మాత్రమే కాక కేసుకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని సుప్రీం కోర్ట్ పేర్కొంది. లక్ష రూపాయలు వ్యక్తిగత పూచి పది రోజుల్లోపు టైల్ కోర్టులో సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో చేసినట్టు గాయాలను మీడియాకు చూపించకూడదని పేర్కొంది. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు బెయిల్ రావడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.