గందరగోళంగా ఉన్న రాజస్థాన్ రాజకీయాల్లో సీఎం అశోక్ గెహ్లాట్ కి సుప్రీంకోర్టు కలుగజేసుకుని బూస్ట్ ఇచ్చినట్లయింది. రేపు జరగబోయే అసెంబ్లీలో బలపరీక్ష ఓటింగ్ లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం పై తాత్కాలిక స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. అంతేకాకుండా తుది నిర్ణయాన్ని రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు కే వదిలేసింది.
అయితే గతంలోనే ఈ పిటిషన్ ని విచారిస్తున్నందున, ప్రస్తుతం తాము ఈ విషయంలో కలుగ జేసుకోలేమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు విలీనం పట్ల బహుజన సమాజ్ పార్టీ అదేరీతిలో బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ లో జరగబోయే బలపరీక్షకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు సీఎం అశోక్ గెహ్లాట్ కి చాలా కీలకం.
ఇప్పటికే రాజస్థాన్ అసెంబ్లీలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని తాత్కాలిక స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టి వేయటంతో, మరోపక్క సచిన్ పైలెట్ మరియు సీఎం అశోక్ గెహ్లాట్ కాంప్రమైజ్ అయిపోవడంతో… రాజస్థాన్ రాజకీయాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.