అమ్మాయిలకు హస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంది అని సుప్రీం కోర్టు తాజాగా సూచించింది. హిందూ వారసత్వ చట్టం సవరణ 2005 ప్రకారం కూతుళ్లకు ఆస్తి హక్కు ఉంటుంది అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మరణించి ఉన్న జీవించి ఉన్న కొడుకులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో హక్కు ఉంటుంది అని సుప్రీం కూతుళ్లకు ఆస్తిహక్కు విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో నేటి తీర్పులో వెల్లడించింది.
ఈ ధర్మాసనంలో అరుణ్ మిశ్రాతోపాటు జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్నారు. కూతురు జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని జస్టిస్ మిశ్రా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ వర్సెస్ ఫులావతి కేసులో తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 లో అమలులోకి వచ్చినందున…సవరణ జరిగిన తేదీన ప్రాతిపదికన తీసుకుంటే ఫులావతికి ఆస్తిలో సమానహక్కు దక్కదనేది ప్రతివాదుల వాదన.
దీనిపై భిన్న వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరికి వివాదాన్ని ముగించారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో సమానహక్కు ఉంటుందని స్పష్టంచేసింది. సుప్రీం తాజా తీర్పుతో ఆస్తి హక్కుల విషయంలో అబ్బాయిలకు సమానంగా అమ్మాయిలకు తీర్పు ఇవ్వడంతో ఆస్తిహక్కు విషయంలో చాలా అనుమానాలకు పులిస్టాప్ ఇచ్చినట్లు అయిందని, క్లారిటీ వచ్చినట్లు తీర్పు ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.