దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది. ఈ ఘటన బయటపడక ముందు చాలా వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు కంట్రోల్ లో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని సుప్రియ పండిత మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని మేము భావించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్టాన్ని అనుసరించి రోజు వారి విధానంలో దర్యాప్తు జరుపుతున్నట్లు, ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ చేస్తున్న విచారణ చివరి దశలో ఉందని కేంద్రం వివరించింది. ఇటువంటి పరిస్థితుల్లో సి.బి.ఐ విచారణ అవసరం లేదని సుప్రీం కోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.