బాలల సంరక్షణ చట్టం కింద నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమా విషయం దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు నమోదయ్యింది చాలా రోజులు గడిచినప్పటికీ ఎందుకు అరెస్టు చేయడం లేదని కేరళ హైకోర్టు లో వారం రోజుల క్రితం పిటిషన్ దాఖలైంది. అర్థనగ్నంగా రెహనా ఫాతిమా దేహంపై తన పిల్లలతో పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియో ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. జరిగిన ఈ ఘటనపై ఆమె పై లైంగిక వేధింపుల కేసు తోపాటు బాలల సంరక్షణ చట్టం కింద (పోక్సో) కింద కూడా కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ నూ తోసిపుచ్చింది.
అంతేకాకుండా సెమీ న్యూడ్ ఫోటో లాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మనదేశ సంస్కృతి గురించి పిల్లలకు ఎలాంటి భావాన్ని ఏర్పరుచు కోవాలని చూస్తున్నావు అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా ఇలాంటి విషయాలు ఆలోచనకు కూడా అందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి ఆలోచనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సెమీ న్యూడ్ బాడీ పెయింటింగ్ ఫోటో ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్న అంటూ సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమాని గట్టిగా ప్రశ్నించింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపిస్తూ, చైల్డ్ పోర్నోగ్రఫీ అంటూ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరమన్నారు. ఓ తల్లి తన పిల్లలను తన అర్ధ నగ్న శరీరంపై చిత్రాలు గీయమని అడిగిందన్నారు. దీనిపై దర్మాసనం మండిపడింది. ‘‘ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇది కాస్త గాభరాగా ఉంది’’ అని వ్యాఖ్యానించింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చు, ఇలాంటివి చేయటం వలన సమాజంలో పిల్లలు తప్పుదోవ పడతారని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో రెహానా ఫాతిమా తరపున న్యాయవాది శంకరనారాయణన్ మాట్లాడుతూ, పురుషులు అర్ధనగ్నంగా ఉన్నా పట్టించుకోరని, మహిళలు అలా చేస్తే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని అన్నారు. మొత్తంగా తన అరెస్టు విషయంలో రెహానా ఫాతిమా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని మాత్రం సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.