దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సందడి ముగిసింది. బీజేపీ వ్యూహం ఫలించింది. తెలంగాణాలో కాషాయానికి ఊపొచ్చింది..! అక్కడితో ఆగిపోతే ఎలా..? రానున్న రెండేళ్లలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణతో పాటూ ఏపీలో కూడా తిష్ట వేయాలనేది ఆ పార్టీ ప్లాన్..! ఓట్లు, సీట్లు లేకుండా ఎలా తిష్ట వేస్తారబ్బా..? అనే అందేహాలు మనకు వస్తాయి.., కానీ అది బీజేపీ. అక్కడున్నది అమిత్ షా, మోడీల బుర్ర. రాజకీయ వ్యహావరాల్లో ఆ బుర్రలో గుజ్జు గట్టిగా.., ఘాటుగా.., చురుకుగా పని చేస్తుంది. అందుకే ఏపీలో తిష్టకి ఆల్రెడీ ఒక ప్లాన్ సిద్ధం చేసారు. అందుకు తిరుపతి ఉప ఎన్నిక ద్వారానే అమల్లోకి తెస్తున్నారు.
జీవీఎల్ “సర్జికల్ స్ట్రైక్స్” మాటల అంతరార్ధం..!?
సర్జికల్ స్ట్రైక్స్ ని రాజకీయాల్లోకి తెచ్చి, దాన్ని చర్చనీయాంశంగా అమలు చేయడం బీజేపీకే సాధ్యమయింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్కడ బండి సంజయ్ ఆ మాటని వాడితే.. ఇక్కడ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వాడారు. ఈరోజు ప్రెస్ మీట్ లో “ఏపీలో పోలీస్ స్టేషన్ లో సెమి క్రిస్మస్ వేడుకలు జారడగం ఏమిటి..? ఎప్పుడైనా దసరా వేడుకలు జరగడం చుసామా..? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో.., ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి. ” అన్నారు. దీని అంతరార్ధమే “తిరుపతి ఉప ఎన్నికలో హిందూ సెంటిమెంట్”. అంటే తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ వాడనున్న ప్రధాన అస్త్రం హిందునే. వారికి బాగా అలవాటైన మత రాజకీయాన్ని నెమ్మదిగా విస్తరించనున్నారు. అందుకే అక్కడ జనసేన కొంచెం జవసత్వాలు ఉన్నప్పటికీ… పవన్ ని చులకన చేసేసి.. బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించడానికి నిర్ణయం తీసుకున్నారు. “నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. జరగబోయేది మేము నడిపిస్తాం” అన్నట్టు పవన్ చేతిలో ఒక “పొలిటికల్ పాలపీక” పెట్టారు..!
ఓట్లు లేవు, సీట్లు లేవు..! కానీ..!!
బీజేపీకి ఏపీలో ఓట్లు లేవు. సీట్లు లేవు. అసలు ఓటర్లకు చూస్తేనే వెగటు పుడుతుంది. ఆ పార్టీకి సొంతంగా పోటీ చేస్తే ఒక్కచోట కూడా డిపాజిట్లు రావు. అటువంటి పార్టీ గెలవడం ఏంటి..? ఎలా సాధ్యం..? అనేదే ప్రతి రాజకీయ అభిమాని అనుమానాలు. దాన్ని బీజేపీనే చూపిస్తుంది. జీరో నుండి పదికి, వందకు, వేయికి ఎదగడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. తిరుపతిలో ఆ పార్టీ గెలవకపోయినా పర్వాలేదు. కానీ వైసిపికి గట్టి పోటీ ఇస్తే చాలు. టీడీపీని వెనక్కు నెట్టేసి రెండో స్థానంలో నిలబడితే చాలు. ఆ పార్టీ లక్ష్యం నెరవేరినట్టే. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఓట్లు అనుసరించి.. ఏపీలో బీజేపీ తదుపరి రాజకీయ అడుగులు.. సీఎం జగన్ కి వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటాయనేది మాత్రం కచ్చితం..!!