చైనాలో పుట్టిన మహమ్మారి (!) కరోనా వైరస్ విషయంలో అందరి చూపు వ్యాక్సిన్పైనే పడిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ఎప్పుడు టీకా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో తీపికబురు వినిపించింది.
ప్రధానంగా మన హైదరాబాద్ మెరిసింది. హైదరాబాద్కు చెందిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)లు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రెండో దశ మానవ క్లినికల్ ట్రయల్ కి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించాయి. ఇక వచ్చే డిసెంబరు నాటికల్లా భారతదేశానికి 60-70 మిలియన్ మోతాదుల ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ లభించనున్నది. అయితే టీకాలు 2021 మార్చి నెలలో మార్కెట్లోకి వస్తాయని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది.
రెడ్డిస్ ల్యాబ్స్ కీలక నిర్ణయం
కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన వ్యాక్సిన్ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు గత సెప్టెంబరు నెలలోఆర్డిఐఎఫ్ తో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఈ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ను సరఫరా చేస్తుంది. దీని ప్రకారమే ప్రస్తుత ట్రయల్స్.
సీరం సంచలనం
ఇక దేశంలోని అందరి చూపు పడిన పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ సైతం కీలక ప్రకటన చేసింది. అస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క కొనసాగుతున్న ట్రయల్స్పై తాజా సమాచారాన్ని వెల్లడించింది. లైసెన్సింగ్ కోసం డిసెంబర్-మార్చి మధ్య సమయం అవసరం అని ఎస్ఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ చెప్పారు. ఆస్టాటెనెకా-ఆక్స్ఫర్స్ వ్యాక్సిన్ మార్కెట్లో విడుదలైన తర్వాత.. మరిన్ని ఎక్కువ టీకాల తయారీని కొనసాగించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ చర్యలు తీసుకోనుంనది. ప్రస్తుతం, ఎస్ఐఐ టీకా యొక్క 2వ, 3వ దశ పరీక్షలను నిర్వహిస్తోంన్నది. ఫార్మా సంస్థ వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తులను ముందుగా కవర్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం లాజిస్టిక్స్ తయారీ పూర్తి స్థాయిలో జరుగుతోంది.
మోదీ కీలక ఆదేశాలు
2021 జూలై నాటికి సుమారు 25 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ను స్వీకరించాల్సిన జనాభాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం గతంలో రాష్ట్రాలను కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి.. టీకాలు త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరారు. టీకాలు చక్కగా నిర్వహించబడేలా ఎన్నికల యంత్రాంగం సహాయం తీసుకోవాలని తాజాగా జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు.
చైనా షాక్….
కరోనాను ఎదుర్కొనేందుకు చైనా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా సానుకూల ఫలితాలనిచ్చింది. బీబీఐబీపీ-సీవోఆర్వీ అనే వ్యాక్సిన్ సార్స్ సీవోవీ-2ను పూర్తిగా అడ్డుకుంటోందని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. టీకా తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావం కనిపించకపోగా, కరోనాను అడ్డుకునే యాంటీబాడీస్ తయారయ్యాయి. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో నివేదించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా టీకాను 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సువారికి ఇచ్చారు. అయితే, అందరిలోనూ ప్రతిరోధకాలు తయారయ్యాయి. అయితే, 60 కంటే ఎక్కువ వయస్సున్నవారిలో అంతకంటే తక్కువ వయస్సున్నవారికంటే కొంచెం తక్కువగా యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. కొవిడ్నుంచి వృద్ధులను రక్షించడమే తమ లక్ష్యమని చైనాలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ పరిశోధకుడు జియామింగ్ యాంగ్ వెల్లడించారు. ఈ వివరాలు ‘ది లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?