ఢిల్లీ, జనవరి 10: నిన్ను సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోని తనను అడిగినట్లు పార్టీ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలిపారు. గురువారం సర్వే ఎఐసిసి క్రమశిక్షణా సంఘం ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. కమిటీ తనకు భరోసా ఇచ్చిందనీ, ఫిర్యాదు రాసి ఇవ్వాల్సిందిగా కోరిందనీ ఆయన చెప్పారు.
తెలంగాణా ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటుగా, పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై సర్వే విమర్శలు సంధించారు. తెలంగాణాలో ఓటమికి వారే కారణమంటూ ఆరోపించారు. ఉత్తమ్ను పదవినుంచి తొలగించి కొత్త వారికి బాధ్యత అప్పగించాలని కోరారు.
గత ఆదివారం తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వీధిన పడ్డాయి. గాంధీభవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో సర్వే, పిసిసి కార్యదర్శి బొల్లు కిషన్ ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో సర్వే ఉత్తమ్, కుంతియాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానితో సర్వేను సస్పెండ్ చేసి ఆయనపై ఏఐసిసికి ఫిర్యాదు చేశారు.
previous post
next post