బాలీవుడ్ నటుడు హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేస్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయటంతో సంచలనం అయ్యింది. మొదటి లో చూశాను చనిపోవడానికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు అని భావించిన తరుణంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్… తన కొడుకు చావుకి కారణం రియా చక్రవర్తి అని తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అంటూ హిందీలో సుశాంత్ కుటుంబ సభ్యులు తొమ్మిది పేజీల లెటర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ పరిధిలో ఉన్న టైంలో సుశాంత్ తండ్రి పై శివసేన సీనియర్ నాయకుడు సంధ్య రావత్ కాంట్రవర్సీ కామెంట్లు ఇటీవల చేయడంతో వెంటనే సుశాంత్ కుటుంబం ఈ లెటర్ రిలీజ్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.
అయితే ఈ లెటర్ లో సుశాంత్ స్వగ్రామం నుండి ముంబాయి వరకు చేరిన పరిణామాలను సవివరంగా లెటర్లో తండ్రి కేకే సింగ్ వివరించడం జరిగింది. సుశాంత్ తల్లిదండ్రులు నలుగురు సోదరిలు తమని తాము నమ్ముకుని ఎంతో కష్టపడి అభివృద్ధి లోకి వచ్చినట్లు ఆ లెటర్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా సుశాంత్ తల్లి మరణించిన తరువాత అతనికి తల్లిలేని లోటు తెలియకుండా పెంచినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనతో ప్రారంభమైన లెటర్… అమ్మ చనిపోయింది అని ఎప్పుడూ సుశాంత్ కి తెలియకూడదని నిర్ణయించుకున్నామని, పైనున్న వారి తల్లి గర్వించేలా పెంచామని పేర్కొన్నారు. అప్పటినుండే నటనా రంగంలో రాణించేలా తీర్చిదిద్దినట్లు లెటర్లో స్పష్టం చేశారు.
ఎంతో కష్టపడి ఎట్లా అయితే తాను అనుకున్న నటనా రంగంలో దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాలపాటు తన కలల ప్రపంచంలో రాణించాడు. ఇంతలోనే సుశాంత్ కి జరగరాని ఘోరం జరిగింది అని అన్నారు. ఇటువంటి ఘటన మరోకరి జీవితంలో జరగకూడదని లెటర్ లో సుశాంత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కావాలని ప్లాన్ గా సుశాంత్ మరణాన్ని మొదట ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ ఈ సమయంలో లెటర్ లో ఎవరి పేరు ప్రస్తావించలేదు. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో…. మరోపక్క సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులు తొమ్మిది పేజీల ఈ లెటర్ విడుదల చేయటం హైలెట్ గా మారింది.