బాలీవుడ్ నటుడు సుశాంత్ కేస్ లో బయటపడుతున్న విషయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు సుశాంత్ రాజ్ పుత్ కి అవకాశాలు రాకుండా అడ్డుకోవడం వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముఖ్యంగా బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణలో…. వెలుగులోకి వస్తున్న విషయాలు కేసు పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల రియా చక్రవర్తి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును సుప్రీంకోర్టు పిటిషన్ల ప్రస్తావించడంపై బీహార్ డిజిపి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత రియా చక్రవర్తి లేదని అనేశారు.
ఇదిలా ఉండగా త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది అందుకే సుశాంత్ కేస్ ఆధారం చేసుకుని రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్ లో రియా చక్రవర్తి పేర్కొంది. అంతేకాకుండా సుశాంత్ సూసైడ్ కేసు లో బీహార్ పోలీస్ లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనకాల బీహార్ సీఎం పాత్ర ఉందని ఆమె పేర్కొన్నట్లు దీంతో డీజీపీ స్థాయి రియా చక్రవర్తిపై మండిపడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.