ఇటీవల ఆదివారం విజయవాడలో కోవిడ్ సెంటర్ కేర్ గా మారి అగ్ని ప్రమాదానికి కారణమైన స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం రెండు వేరు వేరు కమిటీలు వేసింది. ఈ రెండు కమిటీలు 48గంటల్లో ప్రమాదానికి గల కారణాన్ని కి సంబంధించి రెండు నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం టైం ఫిక్స్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటనలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం హోటల్ స్వర్ణా ప్యాలెస్ ని కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చి కరోనా రోగులకు అందులో చికిత్స అందిస్తుంది.
అందులో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదం వలన 10 మంది చనిపోయారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ హాస్పిటల్ యాజమాన్యంపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేస్ ఫైల్ అయినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో…తర్వాత జరిగిన అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ… టిడిపి విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదని చెప్పారు.
మరి ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈ దుర్ఘటనకు ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖ టీడీపీ లెక్కప్రకారం బెజవాడ పరిసర ప్రాంతాలు కూడా రాజధానిగా పనికిరావు కదా అని లాజికల్ ప్రశ్నలు వేస్తున్నారు. అసలు వైజాగ్ లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నించిన చంద్రబాబు, ఈ స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటన విషయంలో ఏం చేయబోతున్నారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. LG polymers లెక్కన దీనిని కూడా ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. పైగా టిడిపికి కొమ్ముకాసే వర్గానికి చెందిన వాళ్ళు ఆ హోటల్ నడుపుతుంది.
అదే రీతిలో… హోటల్ ఆసుపత్రిగా వాడుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్స్ లో covid19 ప్రమాణాలు చూసింది ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. మీ పార్టీకి సపోర్ట్ గా ఉండే వర్గం వాళ్ళు తప్పు చేస్తే సైలెంట్ గా ఉంటారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు టీడీపీ ని కడిగిపారేస్తున్నారు. కనుక ప్రమాదాలు ఎక్కడైనా సహజమే… అవి మానవ తప్పిదాలే ప్రతిదానికి కులం కోణం, రాజకీయ కోణం చూడకండి అంటూ నెటిజన్లు రాజకీయ పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. ఇదే రీతిలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు.