విజయవాడ(అమరావతి), జనవరి 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణా రాష్ట్ర సమితి శాసనసభ్యుదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం సహజమని మంత్రి మీడియాతో అన్నారు. ఇక్కడి ప్రభుత్వ పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన ఆరోపించారు.
ఆంద్ర రాష్ట్ర ప్రజలు సంక్షేమం, అభివృద్ధిని కోరుకుంటుటే చంద్రబాబు ప్రతిరోజూ ‘బాహుబలి ’ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక్క హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ అంతా కట్టానని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. దేశంలో భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలు లేని ఫెడరల్ ఫ్రంట్ను ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.
గత ఏడాది తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశంపార్టీ కలసి పోటీచేసిన మహాకూటమి పరాజయం పొందింది. తిరిగి అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు.
previous post
next post