పాలనా వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంత పట్టుదలతో ఉన్నారో అందరికీ తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ, ఆ వర్గం మీడియా వ్యతిరేకిస్తుండగా, అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తుండగా, వైసీపీ వర్గాలు, సీఎం సీఎం జగన్ మాత్రం పట్టుదలతో ముందుకే వెళ్తున్నారు. అయితే రాజధాని వికేంద్రీకరణ అవసరమా మూడు చోట్ల రాజధానులు అవసరమా అనే చర్చ కూడా కొంత మేరకు మొదలవుతుంది. అనుకూల, ప్రతికూల చర్చలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏపీ లో మూడు రాజధానులట. రాజధాని వికేంద్రీకరణ అంట అనే చర్చలు మొదలు అయ్యాయి. జాతీయ మీడియాలో కూడా కొంత మేర చర్చ జరిగింది. అయితే తాజాగా ఏపీని స్ఫూర్తిగా తీసుకుందో, తమ రాష్ట్రానికి అవసరం అనుకుందో మరో రాష్ట్రం కూడా రాజధాని వికేంద్రీకరణకు సిద్ధం అవుతుంది. తక్షణమే రాష్ట్రంలో ఉన్న రాజధాని కాకుండా మరో రాజధానిగా ప్రకటించాలని సిద్ధమవుతోంది. ఆ కధ ఏమిటో తెలుసుకుందాం రండి.
తమిళనాడు అభివృద్ధి చెందాలంటే మధురై ని రెండవ రాజధాని గా చేయాల్సిందేనని ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్ కుమార్ అన్నారు. దక్షిణ తమిళనాడుకు చెందిన ముఖ్యనాయకులతో మంత్రి ఉదయ్ కుమార్ సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానం చేసినట్లు సమాచారం.
చెన్నైలో వాహనాల రద్దీ పెరగడంతో పాటు తరచూ , వరదలు పోటెత్తుతున్నాయి. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు అవుతుంటాయి. ఈ పరిస్థితులలో రెండవ రాజధాని అవసరాన్ని నేతలు గుర్తించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం మధురై రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?