Sri Lanka: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతినటం తెలిసిందే. దాదాపు 60 కి పైగా దేశాలలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు సంవత్సరాలు కరోనా దెబ్బ కి ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న తరుణంలో.. మరోపక్క.. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక ఆర్థికంగా అన్ని రకాలుగా సంక్షోభం లోకి వెళ్లి పోవడం తెలిసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం జరిగింది. మూడు మార్లు ఎమర్జెన్సీ కూడా దేశంలో విధించడం జరిగింది. తినడానికి ఆహారం పెట్రోల్ ఇంకా అన్ని రకాలుగా శ్రీలంక కొరతలో ఉంది. భయంకరంగా అప్పులు చేయడంతో పాటు.. దేశం ఆర్థికంగా వెనుకబడి పోవడంతో సంక్షోభంలో మునిగిపోవడంతో… శ్రీలంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే సమయంలో శ్రీలంక పాలకులు మిగతా ప్రపంచ దేశాల సహాయాన్ని కోరుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు సాయం అందించడానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ రెడీ అయ్యారు.
ఈ సందర్భంగా చెన్నై పోర్ట్ నుంచి నిత్యావసర సరుకులను షిప్ ద్వారా శ్రీలంకకి పంపించారు. ఆర్థిక సంక్షోభంతో లంక తమిళులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకు రావడం పట్ల శ్రీలంక సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత ప్రభుత్వం శ్రీలంక ఆదుకునే విషయంలో అనేక రీతులుగా సాయం చేయడం జరిగింది. అయినా కానీ శ్రీలంక పరిస్థితి అధ్వానంగా ఉండటం..తో.. మిగతా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోపక్క ఆర్థిక సంక్షోభం అధిగమించడానికి శ్రీలంకలో కరెన్సీ నోట్లు భారీగా ముద్రించడానికి అక్కడి పాలకులు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?