అమరావతి: ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఈ నెల 20న అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షం ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి టీడీపీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.
ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎంతో కీలకమైన సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లు సహా ఇంగ్లీషు మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనితోపాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాజధాని అంశంపై కూడా ప్రకటన చేయనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?