దేశంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే మొన్నటి వరకూ పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో అడపాదడపా మినహా చాలా వరకు హైదరాబాద్ లోనే ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ వ్యవహరించారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు.
ఇలాంటి తరుణంలో ఇటీవల చాలా రోజుల తర్వాత అమరావతి ప్రాంతానికి చంద్రబాబు రావటంతో… చాలామంది నాయకులు కలవాలని ప్రయత్నించిన గాని..ఎవరినీ కలవకుండా బాబు మళ్ళీ హైదరాబాదు వెళ్లిపోవడం జరిగిందట. అయినా త్వరగా వెళ్లి పోవడానికి కారణం కరోనా అని తేలిందట. దీంతో ఈ మాత్రం దానికి ఆయన ఏపీకి రావడం ఎందుకు అనే ప్రశ్న కార్యకర్తల నుండి వస్తున్నట్లు సమాచారం. కరోనా విషయంలో అంత భయమైతే ఇంటిలోనే ఉండొచ్చు కదా…అని అంటున్నారట. అంత ప్రాణ భయం ఉంటే ఎప్పటిలాగానే జూమ్ మీటింగ్లు నిర్వహించుకుంటూ పోతే బాగుంటుంది కదా. ఈ మాత్రం దానికి.. బాబు అమరావతి రావటం దేనికి అని కార్యకర్తలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట.
పోనీ ఆయనకు అంత భయం అయితే నారా లోకేష్ హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారట. మరోపక్క వైరస్ ఉన్నాగాని జనాల్లో ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిపోతున్నారు… ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి ఓడిపోవడం గ్యారంటీ అనే టాక్ క్యాడర్ లో వినపడుతున్నట్లు సమాచారం. విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా చంద్రబాబు… అవకాశాన్ని వదులుకున్నారు. మరోపక్క పార్టీ పైకి తీసుకురావాలని ఓకే వర్చువల్ మీటింగుల్లో తెగ స్పీచ్ ఇస్తారు.
అసలు నాయకుడు ప్రజల లేకుంటే… పార్టీకి మైలేజ్ ఎలా వస్తుందని సొంత నేతలే ఇప్పుడు బాబు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా కరోనా విషయంలో చంద్రబాబు ఇంటికి పరిమితం అయి జూమ్ మీటింగ్ లు పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదని, ఇలానే రాబోయే రోజుల్లో వ్యవహరిస్తే ప్రజలు కూడా బాబుని మర్చిపోయే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నట్లు టాక్.