తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక పోటీ విషయంలో మొన్నటివరకు టిడిపి పార్టీ భయపడుతున్నట్లు పోటీకి దిగకుండా.. ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఉప ఎన్నిక విషయంలో టిడిపి రూటు మార్చినట్లు టాక్. ఇంకా ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎంటర్ కాకముందే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెంచాయి. ఇదిలా ఉండగా ఇటీవల తిరుపతి పార్లమెంట్ పదవీ బాధ్యతల స్వీకరణ ఈ కార్యక్రమానికి హాజరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… జరగబోయే ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అకాల మరణం చెందిన బల్లి దుర్గాప్రసాద్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ లో ఉన్నారు. కానీ 2019 ఎన్నికల సమయంలో చివరిలో టిడిపిని విడిచిపెట్టి వైసిపి పార్టీ ఎంపీ టికెట్ పొంది గెలుపొందారు. గెలిచిన కాని బల్లి దుర్గాప్రసాద్ కి నియోజకవర్గంలో మిగతా వైసిపి నాయకులతో పడటం లేదన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. ఇదిలావుంటే ఇటీవల బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు వైయస్ జగన్ ని కలవడం జరిగింది అంట. దీంతో కూడా రాబోయే ఉప ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులలో ఎవరికైనా టికెట్ ఇస్తారా..? లేకపోతే వేరే వారికి ఇస్తుందా అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది.
అయితే ఈ ఉప ఎన్నిక విషయంలో టిడిపి పార్టీ కంటే ముందు స్పందించిన బీజేపీ… ఇక్కడ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుని నిలబెట్టే యోచనలో ఉన్నట్లు టాక్. కానీ తిరుపతి బీజేపీలో నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు ఉండటంతో ఏం జరుగుతుందో అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలా ఉండగా టిడిపి తాజా పరిస్థితుల బట్టి మనసు మార్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. పైగా చంద్రబాబు సొంత జిల్లా కావడంతో కచ్చితంగా పోటీకి నిలబెట్టడానికి టిడిపి నేతలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు టాక్.