TDP: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుండి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోన గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ కోసం పని చేసే వారీకే టికెట్లు ఇస్తామని ఇప్పటికే చెప్పేశారు. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్ధులను ఎన్నికలకు ముందు ప్రకటిస్తారు. కానీ చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే ఓ స్థానానికి ఇప్పుడే అభ్యర్ధిని ప్రకటించేశారు. ఆ స్థానం టీడీపీ గెలవదు అని అటు పార్టీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ అభ్యర్ధిని నిలపాలి కాబట్టి పోటీ పెడుతుంటారు. అదే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందుల నియోజకవర్గం.
TDP: టీడీపీకి రాజీనామా చేసినా..
ఈ నియోజకవర్గం నుండి సీనియర్ టీడీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి గత కొన్ని సార్లుగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఓటమి పాలయినా వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొంటున్నారన్న ఏకైక కారణంగా ఆయనకు టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత సతీష్ రెడ్డి సైలెంట్ అయ్యారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేశారు. అదే సందర్భంలో రాష్ట్రంలో ఇక టీడీపీ కోలుకోవడం కష్టమేననీ, లోకేష్ నాయకత్వంలో ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు సతీష్ రెడ్డి. ఆ తరువాత సతీష్ రెడ్డి వైసీపీలోకి చేరతారని ప్రచారం జరిగింది. వైసీపీ కూడా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయినప్పటికీ వైసీపీలో చేరలేదు.
టీడీపీ అభ్యర్ధి బిటెక్ రవే
ఈ తరుణంలోనే పులివెందుల టీడీపీ ఇన్ చార్జి బాధ్యతలను చంద్రబాబు బిటెక్ రవికి ఇచ్చారు. అయితే సతీష్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం బీటెక్ రవిని పులివెందుల అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించారు. ఒక వేళ సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చినా బీటెక్ రవే అభ్యర్ధి అని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?