అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న బొత్స వ్యాఖ్యల నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మ్యాప్లో అమరావతిని ఎత్తేశారనీ ఆరోపించారు. రాజధాని లేకుండా ఏపి మ్యాప్ విడుదలకు కారణం వైసిపి ప్రభుత్వమేనని యనమల అన్నారు.
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ స్థలాలను అమ్మడం ఇంకో తుగ్లక్ చర్య అని యనమల విమర్శించారు. రాష్ట్రాన్ని, భూములను వాటాలు వేసుకుని వైసిపి నేతలు పంచుకుంటున్నారని యనమల ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని యనమల హెచ్చరించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీపై అనేక అనుమానాలు ఉన్నాయని యనమల అన్నారు. ఆయన బదిలీ లోగుట్టు వెంటనే బయటపెట్టాలని యనమల డిమాండ్ చేశారు. కులాల వారీగా, మతాల వారీగా సమజాన్ని చీల్చడమే జగన్ లక్ష్యమని యనమల విమర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?