తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం (నెంబర్ 2) కోసం అనేక మంది రకరకాలుగా పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న వారిలో మొన్నటి వరకు లోకేష్ మరియు యనమల రామకృష్ణుడు పేర్లు వినబడ్డాయి. కానీ తాజాగా మాత్రం చంద్రబాబు తర్వాత ఎక్కువగా దేవినేని ఉమా చాలా చురుగ్గా ఉంటూ మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు.
దీంతో జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో చంద్రబాబు తర్వాత దేవినేని ఉమానేనా నెంబర్ 2 ఆయనే నా అనే టాక్ వినబడుతోంది. కరోనా వైరస్ విషయంలో గానీ అదే రీతిలో 3 రాజధానుల నిర్ణయం విషయంలో గానీ మీడియా సమావేశాలలో దేవినేని ఉమా ప్రభుత్వాన్ని దంచి పారేస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దేవినేని ఉమా చంద్రబాబునాయుడు తలలో నాలుకలా వుండి అసెంబ్లీలో మీడియా సమావేశాల్లో జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు.
కాగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ పార్టీ గెలవడంతో చాలావరకూ ఏడాదిపాటు అజ్ఞాతంలోకి దేవినేని ఉమా వెళ్లిపోయినట్లు వ్యవహరించారు. అలాంటిది ఇటీవల కొద్ది నెలల నుండి ఏపీ రాజధాని షిఫ్టింగ్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ, కరోనా విషయంలో మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నిత్యం మీడియాలో రోజుకో సబ్జెక్టుతో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దేవినేని ఉమా వ్యవహరించడంతో చంద్రబాబు తర్వాత దేవినేని యే నెంబర్ 2 అనే టాక్ వినబడుతోంది.