అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అడారి ఆనంద్ ఆదివారం వైసిపిలో చేరారు. టిడిపికి గుడ్ బై చెప్పిన ఆయన వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రమాకుమారి, 12మంది విశాఖ డెయిరీ డైరెక్టర్లు, పలువురు టిడిపి నేతలకు జగన్ వైసిపి కుండువా కప్పు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖ పాల డెయిరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడే ఆనంద్. ఆనంద్తో పాటు ఆయన వర్గీయులు వైసిపిలో చేరడం ఉత్తరాంధ్ర టిడిపికి ఎదురుదెబ్బ తగిలినట్లైయింది.
మూడు దశాబ్దాలుగా టిడిపిలో చేతిలో ఉన్న విశాఖ డైయిరీ ఆనంద్ వర్గీయుల చేరికతో వైసిపికి హస్తగతం అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?