అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. మళ్లీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని కోరారు. రాజధానిని విశాఖ వాసులు కోరుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా టీడీపీ నేత దేవినేని ఉమ మంగళవారం దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేశారు. ఈ దీక్షకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, రైతులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
#దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన #రైతులు.. #మామిడికాయలు, #వేరుశనగ పంటను తీసుకొచ్చారు
దీక్షకు మాజీ ఎమ్యెల్యే #జోతుల #నెహ్రు, @nagulmeeratdp #ఎమ్మెల్సీ రామకృష్ణ సంఘీభావం తెలిపారు
అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
#MyCapitalAmaravati#AmaravatiPeoplesCapital#OneStateOneCapital pic.twitter.com/FrqDAiu4C8— Devineni Uma (@DevineniUma) January 1, 2020