అమరావతి: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏం చేశారు ? ఎవర్ని కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పేరు రావొద్దనే అమరావతి నుంచి రాజధాని తరలింపు చేపడుతున్నారని దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. సౌతాఫ్రికాలో మూడు రాజధానుల ప్రయోగం విఫలమైందన్నారు. విపక్ష నేతగా నాడు అమరావతికి వైఎస్ జగన్ అంగీకారం తెలపలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికాతో ఎలా పోల్చుతున్నారు? అని నిలదీశారు. ఆ దేశంలో మూడు రాజధానుల వల్ల ఆ దేశం ఎంతగా దెబ్బతిందో తెలియదా? అని ప్రశ్నించారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఆర్డీఏ చట్టం ద్వారా అమరావతిలో భూసమీకరణ జరిగిందని వివరించారు. రాజధానిలో కేంద్ర సంస్థలకు కూడా భూములు కేటాయించామని గుర్తు చేశారు. రాజధానిలో రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ఇష్టమొచ్చిన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు.
previous post
next post