(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
పనులన్నీ ఆపేసుకుకూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులు ఇచ్చి ఏం లాభంలే అనుకున్నారేమో, అందుకే కేంద్రం ఏపీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదని అన్నారు.
కేంద్రం మెడలు వంచేస్తాం అన్న మొనగాళ్ళు ఏ పరదాల చాటున చేతులు కట్టుకు నిల్చున్నారో! అని లోకేష్ వ్యాఖ్యానించారు.
కేసుల భయంతో అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఇక్కడ మాత్రం రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చారంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఎనిమిది నెలలలో ఒక్కసారైనా ఏపీకి ఇది ఇవ్వండి అని అడిగే సాహసం చేసారా అని లోకేష్ ప్రశ్నించారు. గెలిచాం అని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పాలని ఆయన కోరారు.