అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ‘సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, రాజభవన్, హైకోర్టు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హెచ్వోడీ భవనాలు, ఇలా పరిపాలనకు కావాల్సిన సమస్తం ఆధునిక సౌకర్యాలతో ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. గత మూడేళ్లుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చు. అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది?’ అని లోకేశ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
‘రాజధాని మారితే ఈ భవనాలను ఏం చేస్తారు ? వీటిని కూడా ప్రజా వేదిక లాగా కూల్చేస్తారా ? ఉన్నవి పీకేసి, కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం, తుగ్లక్ నిర్ణయం కాదా?’ అని లోకేశ్ నిలదీశారు.
గత మూడేళ్ళుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చు. అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది?(2/3)#SaveAmaravati#MyCapitalAmaravati pic.twitter.com/KxpBS3LU2s
— Lokesh Nara (@naralokesh) January 17, 2020
రాజధాని మారితే ఈ భవనాలను ఏం చేస్తారు ? వీటిని కూడా ప్రజా వేదిక లాగా కూల్చేస్తారా ? ఉన్నవి పీకేసి, కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం, తుగ్లక్ నిర్ణయం కాదా?(3/3)#SaveAmaravati#MyCapitalAmaravati pic.twitter.com/SptnfdwS1T
— Lokesh Nara (@naralokesh) January 17, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?