అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎదురులేని నాయకులుగా చలామణి అయిన జెసి బ్రదర్స్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ హయాంలో వైయస్ జగన్ ని బండ బూతులు తిడుతూ రణరంగం సృష్టించిన జెసి బ్రదర్స్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. బిఎస్ 3 వాహనాలను బిఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయడంతో కేసు నమోదు అయి జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన కాని పోలీసుల పై విమర్శలు చేయటం తో పాటు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం తో మళ్లీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఆర్థికంగా ట్రావెల్స్ వ్యాపారం దెబ్బ తినడంతో పాటు తాజాగా ఇటీవల మైనింగ్ గనుల విషయంలో లీజ్ క్యాన్సల్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా జేసీ దివాకర్ రెడ్డి ఇదంతా తన కుటుంబం పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అని అన్నారు.
కాగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ .. చంద్రబాబు చాలా సాత్వికుడు. దుర్మార్గమైన ఆలోచనలు లేవని అయినా కానీ ఆయన గొంతు పై కత్తి పెట్టి …, తరువాత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా వారిపై మంచి కేసులు పెట్టే రీతిలో చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని జెసి దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయినా ఊరుకునే ప్రసక్తి లేదని కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అన్న రీతిలో జేసీ దివాకర్ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.