ఏపిలో రాజకీయ మళ్ళీ వేడెక్కుతోంది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి అధికార పార్టీ వైపు జంపింగ్లకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలోనే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చింది. అయితే ఒక పక్క వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ అధిష్టానం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా, మరో పక్క ఆ పార్టీ కీలక నేతలు చంద్రబాబుకు రాంరాం చెప్పి జగన్ పాలనకు జై కొట్టేందుకు సిద్దపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నందున చంద్రబాబుకు దూరం అయి జగన్ కు దగ్గర అవుతున్నారు కానీ వైసీపీ కండువా కప్పుకోవడం లేదు. ఇప్పటికే ముగ్గురు టీటీడీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అనధికారికంగా విడాకులు తీసుకోని వైసీపీతో సహజీవనం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ముఖ్య నేతలు నేరుగా వైసీపీ కండువా కప్పుకున్నా జరిగే నష్టం ఏమిలేదు.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత సిద్దా రాఘవరావు చంద్రబాబుకు షాక్ ఇచ్చి జగన్ పాలనకు జై కొట్టేందుకు సిద్ధం అయ్యారు. అయన వైసీపీ తీర్థం పుచ్చుకునే ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. బుధవారం నాడు వైసీపీ అధినేత, సీ ఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఆయన పార్టీ మారనున్నారని వార్తలు వచ్చాయి కానీ..ఎదో కారణాల రీత్యా వాయిదా పడింది. కార్యకర్తలు, ఆయన అభిమానులు అభిప్రాయం మేరకు సిద్దా వైసీపీలో చేరేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన ఈ మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?