అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని ముసలి వారు అయ్యాడంటూ బొత్స వ్యంగ్యంగా విమర్శించడంపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ..ఎవరు ముసలి వాళ్ళో – ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదామన్నారు. ‘ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా సరే చంద్రబాబు కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి ? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు .. మిగిలిన వారు ముసలోళ్ళు !!’ అని అచ్చెన్నాయుడు పేర్కొంటూ ఈ పోటీకి బొత్స సిద్ధమేనా అని ప్రశ్నించారు. పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని బొత్స పత్రికా సమావేశంలో ఒప్పుకోవాలని అచ్చెన్న అన్నారు.
.