(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా? లేక 30మంది ఎమ్మెల్యేలా? అని అడిగారు. నిన్న శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో సిఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హజరు కావడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
జగన్ పాలన, నిర్ణయాల పట్ల సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందని శాసనసభ వేదికగా బయటపడిందని లోకేష్ అన్నారు. ఆఖరికి జగన్ సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆఖరికి జగన్ గారు సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారని టాక్. సొంత పార్టీలోనే జగన్ గారి పాలన, నిర్ణయాల పట్ల ఇంత వ్యతిరేకత ఉంది అని శాసనసభ వేదికగా బయటపడింది.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 28, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?