అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని రామానాయుడు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్పై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టారని అన్నారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ దళిత నేతలను అణిచివేతకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. నామినేటెడ్ పదవులను ముఖ్యమంత్రి జగన్ తన సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారని రామానాయుడు ఆరోపించారు. మీడియాను అణిచివేతకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాజమండ్రి పర్యటనలో మీడియాను అనుమతించకపోవటం అన్యాయమన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?