విశాఖ రాజకీయాలలో తిరుగులేని నేతగా టిడిపి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా ఉన్నప్పటికీ తన నియోజక వర్గం విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో మాత్రం తన సత్తా చాటారు. తండ్రి అప్పల నరసింహం మరణించిన తరువాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1999లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి టిడిపి పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. గణబాబు తన నియోజకవర్గ ప్రజలను చాలా కంటికి రెప్పలా కాపాడుకుంటారనే మంచి టాక్ ఉంది. అటువంటిది తన నియోజకవర్గ పరిధిలో ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగిన సమయంలో పార్టీ హైకమాండ్ నుండి ఎలాంటి సపోర్టు లేకపోవటం తో అప్పట్లో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై గణబాబు ఫీల్ అయ్యారట.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన లో బాధితులను పరామర్శించడానికి వస్తానని మాట ఇచ్చింది చంద్రబాబు రాకపోవడం జరిగింది. కానీ గణబాబు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన 13 మంది కుటుంబ సభ్యులకి పార్టీ తరఫున 50,000 చొప్పున అందజేశారు. ఆ తర్వాత అచ్చెనాయుడు వ్యవహారంలో తన నియోజకవర్గం వైపుగా నారా లోకేష్ వెళ్ళినా గాని ఆగకుండా గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించకుండా వెళ్లిపోయారు.
దీంతో అప్పటి నుండి చిన్న బాబు లోకేష్ మేటర్ లో టిడిపికి చెందినా ఈ స్ట్రాంగ్ ఎమ్మెల్యే గణబాబు అసంతృప్తిగా ఉన్నట్లు, పార్టీ కార్యక్రమాలకి కూడా దూరంగా ఉన్నట్లు విశాఖ జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ మధ్య అస్సలు విమర్శలు కూడా గణబాబు చేయడం లేదని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా విశాఖపట్టణానికి జగన్ ప్రభుత్వం రాజధాని తీసుకు వస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపి నేతలు చాలా వరకు వైసీపీ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.