టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), ఏలూరి సాంబశివరావు (పర్చూరు) వైసిపిలో చేరిక వ్యవహారం మొన్న ఉదయం నుండి మీడియాలో బాగా నలిగింది. అన్ని చానెళ్లు, సోషల్ మీడియా.., మా “న్యూస్ ఆర్బిట్” సహా ప్రధాన వార్తగా ప్రచురించాము. నిజానికి ఈ చేరిక మే 29 లోగా ముగించాలి అనుకున్నప్పటికీ చిన్న బ్రేక్ పడింది. చర్చల్లో ఒక అవగాహన రాకపోవడంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోగా మరోసారి భేటీ అయి విషయాన్నీ ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాజధానిలో ఉన్నారు. ఈ విషయమై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ “పార్టీలోకి ఎవరూ రావడం లేదు” అన్నారు. దీని వెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తుంది. చర్చల్లో తుది నిర్ణయం తీసుకోకపోవడం… పర్చూరు లో ఇప్పటికే ఉన్న కొందరు నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయం భిన్నంగా ఉండడంతో ఆగింది.
జగన్ వద్దకి చివరి పంచాయతీ…!
నిజానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి లో చేరేందుకు సిద్ధంగానే ఉన్నారు. ప్రాధమికంగా చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ డిమాండ్లు, స్థానికంగా పార్టీ కీలక నాయకులు అంగీకరించడం.., నియోజకవర్గం పెత్తనాలు ఇవ్వడం… ఆశించిన ప్రయోజనాలు కల్పించడం… ఇలా రకరకాల చర్చల్లో స్తబ్దత నెలకొంది. మంత్రి బాలినేని వద్ద అంగీకారం కుదిరింది. చివరిగా సీఎం జగన్ ఆమోదం తెలిపిన తర్వాత రేపు లేదా ఎల్లుండి చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం జగన్ “తోలి ఏడు- జగనన్న తోడు”… జగన్ ఏడాది పాలన కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం.., కోర్టు వ్యవహారాల్లో కొన్ని చర్చలు జరుపుతుండడంతో ఈరోజు సమయం వీలుపడలేదు. మంత్రి బాలినేని.., సీఎం జగన్ ని కలిసిన తర్వాత ఈ ఇద్దర్నీ తీసుకుని వెళ్లి చేర్పించనున్నారు. ఇది జరిగిన తర్వాత మరో ఇద్దరితో కూడా చర్చలు ప్రారంభిస్తారు. మే 29 న తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుంది. ఆ సమయానికి పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను లాగేయాలన్నది వైసిపి వ్యూహం గా ఉన్నప్పటికీ సీఎం జగన్ వేరే పనుల్లో గడపడం, అంతర్గత చర్చలు తేలకపోవడంతో తాత్కాలికంగా ఆగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?