టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటి స్పీకర్ తిరస్కరించారు. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభలో పదేపదే అడ్డుతగలడంపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితర అధికార పక్ష సభ్యులు తప్పుబట్టారు. సభలో ఏదో విధంగా గొడవ చేసి సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్లు వచ్చినట్లు కనబడుతోందన్నారు. టీడీపీ సభ్యులు అడిగే ప్రతి అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నా గొడవ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. తాను రైతు సమస్యలపై చర్చించేందుకు అనుమతిస్తామని చెప్పినా వినలేదనీ, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. తాను చాలా సేపు వారిని సస్పెండ్ చేయకుండా వెయిట్ చేశాననీ, కానీ వారి ప్రవర్తన మార్చుకోలేదని అన్నారు. సభ్యుల హక్కులను టీడీపీ సభ్యులు హరించి వేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని అన్నారు. ప్రజలు అన్ని గమనించాలనే తాము వారికి సమయం ఇచ్చానని పేర్కొన్నారు స్పీకర్ తమ్మినేని. సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్లాలన్నది వారి ఉద్దేమని అన్నారు మంత్రి ఆర్కే రోజా.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం లో విచారణ .. సీబీఐ, ఏపి సర్కార్ కు నోటీసులు