అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు ఎన్ని బాటిళ్ల నీళ్లు తాగారు, ఆయన తిని వదిలివేసిన ప్లేట్లు ఎన్ని అంటూ లెక్కలు వేయడం మాని రాష్ట్రం కోసం ఆయన పడిన కష్టాన్ని లెక్కించండి అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ‘గతంలో మీ దొంగ లెక్కల పాపాలు త్వరలోనే ప్రక్షాళన అవుతాయి. పెద్దల సభలో ఉన్నారు. కాస్తంతయినా పెద్దరికం తెచ్చుకోండి’ అంటూ బుద్దా హితవు పలికారు.
.