(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మీడియా ప్రతినిధులపై కేసు పెట్టడాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. సిఎం జగన్ ఇంత దిగజారి పోతారని ఆనుకోలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టిస్తారా? సిగ్గుగా లేదా ?అని లోకేష్ విమర్శించారు.
విద్యార్థులను ఎండలో కోర్చోబెట్టి పాఠశాలను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచానికి చూపిస్తే మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసు పెట్టారంటే జగన్మోహనరెడ్డి ఎనిమిది నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థం అవుతోందని అన్నారు.
మీడియా స్వేచ్చను హరించిన నియంతలు కాల గర్భంలో కలిసిపోయారని పేర్కొన్నారు. 2430 జివో ద్వారా జగన్ తన నియంతృత్వ ధోరణి బయటపెట్టారనీ, ఇప్పుడు మీడియా ప్రతినిధులపై కేసుల ద్వారా తనలోని భయం బయటపడిందనీ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డ్ పిచ్చి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెంటనే మీడియా ప్రతినిధులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
మీడియా స్వేచ్ఛని హరించిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. 2430జిఓ ద్వారా మీ నియంతృత్వ ధోరణి బయటపెట్టారు. ఇప్పుడు మీడియా ప్రతినిధుల పై కేసులు ద్వారా మీ భయం బయటపడింది. జగన్ గారి పిచ్చి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను, వెంటనే ప్రతినిధుల పై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి(3/3)
— Lokesh Nara (@naralokesh) January 24, 2020