అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ మహిళా కమిషన్ రాజధాని ప్రాంతానికి వస్తుందని తెలిసి పోలీసులను వెనక్కి పిలిపించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
” గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపించారు. గ్రామంలో వెయ్యి మంది పోలీసులను దించారు. మహిళల్ని బూటుతో తన్నించారు. ఇప్పుడు జాతీయ మహిళా కమిష వస్తుందని తెలిసి పోలీసులను వెనక్కి పిలిపించి ఇన్నిరోజులు తాము చేసింది తప్పు అని జగన్ స్వయంగా ఒప్పుకున్నారు” అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, పోలీసులు ఉన్నప్పుడు రాజధాని గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? మహిళా కమిషన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లేకుండా గ్రామాలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై ఓ వీడియోను పోస్టు చేశారు.
గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపించారు. గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దించారు. మహిళల్ని బూటుతో తన్నించారు. ఇప్పుడు జాతీయ మహిళా కమీషన్ వస్తుందని తెలిసి పోలీసులను వెనక్కి పిలిపించి ఇన్ని రోజులు చేసింది తప్పు అని @ysjagan గారు స్వయంగా ఒప్పుకున్నారు.#SaveAmaravati pic.twitter.com/JlcL47x277
— Lokesh Nara (@naralokesh) January 12, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?