అమరావతి: ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కుట్టు కట్టించినట్లుంది జగన్మోహనరెడ్డి తెలివితేటలు అని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్య ప్రజలకూ అర్థమైందని లోకేష్ అన్నారు.
బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంను కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవం లేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని లోకేష్ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్లో భాగంగా ప్రాజెక్టు పైకి చైనా మేఘాలు కమ్ముకొస్తున్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రకాశం బ్యారేజీ గేటుకు అడ్డంగా పడవ పడితే తీయడానికి వారం రోజులు పట్టిందనీ, గోదావరిలో మునిగిన బోటును రెండు వారాలుగా తీయలేక 144 సెక్షన్ పెట్టారనీ లోకేష్ విమర్శించారు. మంత్రికి అలవాటైన విద్యేమో పోలవరంపైనా బెట్టింగ్ కాద్దామంటూ సవాల్ విసురుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?