అమరావతి: చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసిపి కుట్రలు బయటపడతాయన్న భయంతో కాన్వాయ్పై వైసిపి గుండాలను రప్పించి దాడులు చేయిస్తారా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మరీ ఇంత పిరికితనమా అని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా అని లోకేష్ ప్రశ్నిస్తూ చంద్రబాబు కాన్వాయ్పై కొందరు చెప్పులు విసురుతున్న క్లిప్పింగ్స్ వీడియోను పోస్టు చేశారు.
.@ncbnగారి అమరావతి పర్యటనలో వైసీపీకుట్రలు బయట పడతాయన్న భయంతో కాన్వాయిపై మీ పార్టీ గూండాలను రప్పించి దాడులు చేయిస్తారా? మరీ ఇంత పిరికితనమా? తెదేపా హయాంలో మేము కూడా ఇలా చేస్తే @ysjaganగారు పాదయాత్ర చేయగలిగేవారా?#ChaloAmaravati#PeoplesCapitalAmaravati#SaveAmaravati#JaganFailedCM pic.twitter.com/9EZUv8UXph
— Lokesh Nara (@naralokesh) November 28, 2019