పదవి కావాలి.. అధికారంలో ఉండాలి.. ఎమ్మెల్సీ గా కొనసాగాలి… అనర్హత పడకూడదు… విప్పు ధిక్కరించాలి… కానీ హోదా పోకూడదు… ఇవే ఈ ఎమ్మెల్సీల ఆలోచనలు కాబోలు. అందుకే అనర్హత విచారణను సైతం లెక్కచేయలేదు. హాజరు కాలేదు. అనారోగ్యం అనే కుంటి సాకులతో తప్పించుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు సునీత, శివనాథ్ రెడ్డిలు మూడు నెలల కిందట శాసనమండలిలో జరిగిన ఓటింగ్ లో పార్టీ విప్ ని ధిక్కరించిన సంగతి తెలిసిందే. బాహార్గటంగానే వైసీపీకి జై కొట్టారు. దీంతో బాగా మండిన టీడీపీ వారిని అనర్హులుగా పరిగణించాలంటూ పిర్యాదు చేసింది. ఆ విచారణ నిన్న జరిగింది. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు హాజరు కాలేదు.
అనారోగ్యమట… వెళ్లలేరట…!
తనకు అనారోగ్యంగా ఉందని, అందువల్ల తనకు మరో నెలపాటు సమయం ఇవ్వాలంటూ సునీత చైర్మన్ షరీఫ్ కు ఒక లేఖ పంపారు. శివనాథ్ రెడ్డి కూడా ఇదే తరహా సమాచారం అందించడంతో విచారణ వాయిదా పడింది. కాగా ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు తమ వాదన వినిపించుకోవడానికి మరో అవకాశం ఇస్తామని తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని చైర్మన్ షరీఫ్ చెప్పారు. టిడిపి పక్షాన ఈ విచారణకు శాసన మండలిలో విప్ గా వ్యవహరిస్తున్న బుద్దా వెంకన్న, మరో ఎమ్మెల్సీ అశోక్ బాబులు హాజరయ్యారు. కుంటి సాకులు చూపి పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు విచారణకు రాలేదని అయినా వారిని వదిలిపెట్టబోమని బుద్దా వెంకన్న ఈ సందర్భంగా చెప్పారు. నిజానికి సునీతకు అనారోగ్యం అంటూ ఏమి లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు, తరచు పర్యటనలు చేస్తున్నారు. కాకపోతే పదవి ఉండాలంటే ఇటువంటి డ్రామాలు తప్పవుగా.