(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: శాసనమండలిని రద్దు చేస్తూ ఏపి కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో టిడిపి విజయవాడ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూ ట్విట్ చేశారు.
‘జగన్ అన్నా నీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవడానికి కాదు దమ్ముగా పోరాడతావని, ఇంత పిరికి వాడివి అనుకోలేదు’ అని నాని వ్యాఖ్యానించారు.
జగన్ అన్నా@ysjagan నీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది 28 మంది ఎమ్మెల్సీ ల దెబ్బకు భయపడి పారిపోవటానికి కాదు దమ్ముగా పోరాడతావని . ఇంత పిరికివాడివి అనుకోలేదు.???
— Kesineni Nani (@kesineni_nani) January 27, 2020