(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా వారిపై విమర్శలు గుప్పించారు.
ప్రపంచంలో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదన్నారు. ‘ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కొరే/పోరాడే ప్రజా ప్రతినిధులను చూసాము. మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే వైసిపి ప్రజాప్రతినిధులు ఉండటం మన కర్మ’ అని కేశినేని నాని పేర్కొన్నారు.