NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP MP Kesineni Nani: టీడీపీలో హాట్ టాపిక్ గా కేశినేని వ్యవహారం…! చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లేనా…?ఇది క్లారిటీ..

TDP MP Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారనీ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. ఆయన సిమ్లాలో ఉన్న సమయంలో నాని రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ నుండి పోటీ చేయడం లేదనీ, వేరే అభ్యర్థిని చూసుకోవాలని కూడా చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా విజయవాడ కేశినేని భవన్ (నాని కార్యాలయం) లో చంద్రబాబు నాయుడు ఫోటోతో సహా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జీల ఫోటోలను పీకేశారనీ, ఆ ఫోటోల స్థానంలో కేశినేని నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల ఫోటోలతో పాటు రతన్ టాటా తో నాని ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అయ్యింది.

TDP MP Kesineni Nani:  బీజేపీలో చేరే ఆలోచన చేస్తున్నారా..?

గత కొంత కాలంగా పార్టీ అధినేతతో, స్థానిక నేతలతో అంటీ మున్నట్లుగా వ్యవహరిస్తున్న కేశినేని నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ, కేంద్ర బీజేపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే చంద్రబాబు అలర్ట్ అయి ఆయన వద్దకు టీడీపీ నేతల బృందాన్ని పంపించడం, ఆ తరువాత చంద్రబాబే స్వయంగా గోరంట్లతో చర్చలు జరిపి ఆయన అలక తీర్చడం తెలిసిందే. కేశినేని పార్టీకి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినా పార్టీ అధినేత నుండి బుజ్జగింపులు గానీ చర్చలు గానీ జరపకపోవడంతో ఆయన చంద్రబాబు తీరుపై అసమ్మతి తో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ కేశినేని భవన్ లో ఫోటోలు పీకేసిన వ్యవహారంపై, ఆయన బీజేపీలో చేరనున్నారు అంటూ వస్తున్న వదంతులపై కేశినేని ట్విట్టర్ వేదిక గా కూడా స్పందించలేదు.

వదంతులపై స్పందించిన కేశినేని స్వేత

అయితే కేశినేని నాని కుమార్తె, విజయవాడ కార్పోరేటర్ కేశినేని స్వేత ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయవాడ లోని కేశినేని భవన్ (కార్యాలయం) ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ కెమెరా కొంచెం జూమ్ అవుట్ చేసి ఉంటే సరిపోయేది అని పేర్కొంది. ఆ ఫోటోలో గతం నుండి ఉన్న ఫోటోలు యథాతధంగా ఉన్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్, పార్టీ ఫోటోలు ఉన్నాయి. కొంచెం దూరం నుండి ఫోటో తీయడంతో కెమెరా జూమ్ అవుట్ చేసి తీస్తే సరిపోయేది అని ఆమె పెర్కొంది. మరో పక్క కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోలు తొలగించలేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.రెండు రోజుల క్రితం నుండి కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు రాజీనామాల వార్తలు వెలుగులోకి రావడంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేశినేని పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేశినేని అభిమానులు పేర్కొంటున్నారు. దీనిపై కేశినేని స్వేత వెంటనే స్పందించడం పట్ల ఆయన అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju