అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలపై విజయవాడ ఎంపి కేశినేని నాని సోషల్ మీడియాలో తన దైన శైలిలో విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం, హైదరాబాదును అభివృద్ధి చేద్దాం అనేలా జగన్ చర్యలు ఉన్నాయంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చివేత జరిగింది, విజయవాడ – సింగపూర్ విమాన సర్వీసు రద్దయింది, కెసిఆర్తో మాత్రం వరుస సమావేశాలు జరుగుతున్నాయి అనే విధంగా ఫోటోలను షేర్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సొంత పార్టీనే ఇరకాలంలో పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేశినేని వారం నుండి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన దైన శైలిలో పరోక్ష విమర్శలు చేస్తూ పోస్టులను పెడుతున్నారు.
అమరావతిని కూల్చేద్దాం…
హైదరాబాద్ ని అభివృద్ది చేద్దాం… pic.twitter.com/mwg2qqRYrB— Kesineni Nani (@kesineni_nani) June 30, 2019